మ‌రోసారి ఆంధ్రప్ర‌దేశ్‌కు కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్ల‌నున్నారు. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వ‌ర‌కు విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠంలో జ‌ర‌గ‌నున్న అష్ట‌బంధ‌న మ‌హాకుంభాభిషేకం మ‌హోత్స‌వాలకు కేసీఆర్ [more]

Update: 2019-02-07 06:28 GMT

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్ల‌నున్నారు. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వ‌ర‌కు విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠంలో జ‌ర‌గ‌నున్న అష్ట‌బంధ‌న మ‌హాకుంభాభిషేకం మ‌హోత్స‌వాలకు కేసీఆర్ కు ఆహ్వానం అందింది. ఆయ‌న‌తో పాటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆధిత్య‌నాధ్‌ను కూడా ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించిన‌ట్లు శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి తెలిపారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత కేసీఆర్ శార‌దాపీఠం వెళ్లి రాజ్య‌శ్యామ‌ల అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న విష‌యం తెలిసిందే.

 

Tags:    

Similar News