నేడు కీలక భేటీ… కీలక నిర్ణయం

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమీక్ష చేయనున్నారు. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా హైదరాబాద్ లో కేసులు మరింత పెరిగే [more]

Update: 2020-06-08 02:59 GMT

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమీక్ష చేయనున్నారు. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా హైదరాబాద్ లో కేసులు మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు నేటి నుంచి బార్లు, రెెస్టారెంట్లు కూడా తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. దీంతో పాటు పదో తరగతి పరీక్షలపై హైకోర్టు ఉత్తర్వులను కూడా కేసీఆర్ సమీక్షించి దానిపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు. పరీక్షలు లేకుండా అందరినీ ఉత్తీర్ణులను చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News