వారికి కేసీఆర్ స్పష్టమైన హామీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. 27 శాతం కంటే ఎక్కువ పీఆర్సీ అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాలు [more]

Update: 2021-03-10 01:23 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. 27 శాతం కంటే ఎక్కువ పీఆర్సీ అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడూ అన్యాయం చేయదని కేసీఆర్ పేర్కొన్నారన్నారు. తమకు కేసీఆర్ పై నమ్మకం ఉందని చెప్పారు. ఉద్యోగుల సమస్యలన్నింటికి త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తాము ఇప్పటికిప్పుడు ప్రకటన చేయలేక పోతున్నట్లు కేసీఆర్ తమకు చెప్పారన్నారు. ఏపీ కంటే ఎక్కువ పీఆర్సీ ని ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

Tags:    

Similar News