చంద్రబాబుపై టీఆర్ఎస్ ఎంపీ కవిత కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి లేదని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బుధవారం ఆమె ఓ ఛానల్ తో మాట్లాడుతూ… ప్రజల [more]

Update: 2019-01-30 10:33 GMT

ఆంధ్రప్రదేశ్ సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి లేదని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బుధవారం ఆమె ఓ ఛానల్ తో మాట్లాడుతూ… ప్రజల ఆదరణ పూర్తిగా కోల్పోయిన చంద్రబాబు టెన్షన్ లో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని అన్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. దేశానికి బీజేపీనే అవసరమన్న చంద్రబాబు ఇప్పుడు తన స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని ఆరోపించారు.

Tags:    

Similar News