పూజలు చేసిన మరీ....?

Update: 2018-05-12 03:49 GMT

పూజలు చేసి మరీ పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు కన్నడనాట నేతలు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన తర్వాత షికారిపురాలో ఓటు హక్కు వేయడానికి వెళ్లడం విశేషం. బీజేపీ కర్ణాటకలో అధికారంలోకి రావాలని యడ్యూరప్ప ప్రత్యేక పూజలు చేశారు. ఇక బాదామి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తలపడుతున్న గాలి జనార్థన్ రెడ్డి సన్నిహితుడు శ్రీరాములు ఉదయాన్నే గోపూజ చేశారు. ఆయన గోపూజ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. మరోవైపు మాజీ ప్రధాని దేవెగౌడ ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోయింది. బళ్లారిలోని 189 వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పనిచేయలేదు. జేడీఎస్ నేత, మాజీ కార్పొరేటర్ మల్లేష్ గాంధీనగర్ పోలింగ్ కేంద్రం వద్ద డబ్బులు పంచుతూ దొరికిపోయారు. మల్లేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News