బ్రేకింగ్ : సభ రేపటికి వాయిదా

కర్ణాటక అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. విశ్వాస పరీక్షను ఈరోజే పూర్తి చేయాలని గవర్నర్ వాజుబాయి వాలా లేఖ పంపినా స్పీకర్ రమేష్ కుమార్ సభను రేపటికి [more]

Update: 2019-07-18 13:00 GMT

కర్ణాటక అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. విశ్వాస పరీక్షను ఈరోజే పూర్తి చేయాలని గవర్నర్ వాజుబాయి వాలా లేఖ పంపినా స్పీకర్ రమేష్ కుమార్ సభను రేపటికి వాయిదా వేశారు. గవర్నర్ ఆదేశాలను పాటించనందుకు బీజేపీ నేత యడ్యూరప్ప సభలోనే ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. యడ్యూరప్పతో పాటు బీజేపీ సభ్యులందరూ సభలో కూర్చుని నిరసనలు తెలియజేస్తున్నారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య సభ రేపటికి వాయిదా పడింది. ఈరోజే విశ్వాస పరీక్ష నిర్వహించాలని, లేకుంటే రాత్రంతా సభలోనే ఉండి నిరసనను తెలియజేస్తానని యడ్యూరప్ప చెబుతున్నారు.

Tags:    

Similar News