మొదలైన శాసననసభ

Update: 2018-05-19 05:58 GMT

దేశ్యవాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక విధానసభ సమవేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయ గీతం అనంతరం ప్రొటెం స్పీకర్ నూతన శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మొదట ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం తాజా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు.

అందరి ముఖాల్లో కనిపించని ఆందోళన

అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలంతా హాజరవడంతో సభ నిండుగా కనిపించింది. సభ ప్రారంభానికి ముందుగానే పలువురు ఎమ్మెల్యేలు వచ్చి కూర్చున్నారు. అటు బీజేపీ ముఖ్యనేతలతో పాటు కాంగ్రెస్ జేడీఎస్ ముఖ్య నేతల్లోనూ ధైర్యం ప్రదర్శిస్తూ, చిరునవ్వు చిందించారు. కానీ, ఎమ్మెల్యేల్లో మాత్రం ఆందోళన కనపడింది. బీజేపీ నేత, గాలి జనార్థన్ రెడ్డి సన్నిహితుడు బి.శ్రీరాములు నవ్వుతూ ఫోన్లు మాట్లాడుతూ కన్పించారు. జేడీఎస్ నేత కుమారస్వామిని సిద్ధరామయ్య పలకరించారు.

Similar News