బ్రేకింగ్ : కన్నడ సీఎం ఎవరనేది ఏడు రోజుల తర్వాతే

Update: 2018-05-15 12:00 GMT

కర్ణాటక రాజకీయం రాజ్ భవన్ కు మారింది. కేంద్రమంత్రి అనంతకుమార్, బీజేపీ నేత యడ్యూరప్ప కొద్దిసేపటి క్రితం గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమకు ఏడు రోజులు సమయాన్ని గవర్నర్ ఇచ్చారని యడ్యూరప్ప తెలిపారు. తాము కర్ణాటకలో అతి పెద్ద పార్టీగా అవతరించామని, తొలుత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమనే ఆహ్వానించాలని గవర్నర్ ను కోరినట్లు తెలిసింది. దీంతో గవర్నర్ వాజూభాయి ఏడు రోజుల సమయం ఇచ్చారు. మరికాసేపట్లో జేడీఎస్ నేత కుమారస్వామి కూడా గవర్నర్ ను కలవబోతున్నారు. తమ కూటమికి అవసరమైన మెజారిటీ ఉందని గవర్నర్ కు ఆయన వినతి పత్రం అందించనున్నారు.

Similar News