జగన్, పవన్ పై పాల్ వ్యాఖ్యలు..! వైరల్ అయిన వీడియో

రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేది ప్రజాశాంతి పార్టీనే అని.. తానే ముఖ్యమంత్రిని అవుతానని చెబుతున్న మతప్రభోదకుడు కేఏ పాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ [more]

Update: 2019-01-26 07:33 GMT

రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేది ప్రజాశాంతి పార్టీనే అని.. తానే ముఖ్యమంత్రిని అవుతానని చెబుతున్న మతప్రభోదకుడు కేఏ పాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్య రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ ప్రెస్ మీట్లు పెడుతూ, సోషల్ మీడియా లైవ్ ల ద్వారా హల్ చల్ చేస్తున్న పాల్ తాజాగా ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చారు. అయితే, ఇంకా కెమెరా స్టార్ట్ కాలేదు అనుకున్న ఆయన.. ఆఫ్ ది రికార్డుగా కొన్ని మాటలు మాట్లాడారు. ‘పవన్ అవుట్.. ఇప్పుడు జగన్ అవుట్.. ఇక బాబుకే వచ్చేస్తుంది’ అనే మూడు మాటలే మాట్లాడారు. ఈ మాటలు వీడియోలో రికార్డు కావడంతో వైరల్ గా మారింది. అసలు ఏ ఉద్దేశ్యంతో ఆయన ఈ మాటలు మాట్లాడారనేది తెలియడం లేదు. అయితే, పాల్ ద్వారా జగన్ కి ఓటు బ్యాంకుగా ఉన్న క్రిస్టియన్ ఓట్లు చీల్చే ప్రయత్నం జరుగుతుందని.. అందుకు పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఉదాహరణ అనేది వైసీపీ శ్రేణుల వాదన.

Tags:    

Similar News