కేసీఆర్ ఓటమి ఖాయం...బాబు జోస్యం....!!

Update: 2018-11-14 04:13 GMT

తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. కె.చంద్రశేఖర్ రావు ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్తున్నందునే ఓటమి తప్పదన్నారు. తెలంగాణలో ప్రజాకూటమి విజయం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు జరిపిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కొంపముంచింది 105 టిక్కెట్లను ఏకపక్షంగా ప్రకటించడమేనన్నారు. దీంతో టీఆర్ఎస్ కు తెలంగాణలో అత్యంత విషమ పరీక్షను ఎదుర్కొంటుందన్నారు.

వారం రోజుల ముందే.....

అలాగే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజాకూటమి రోజురోజుకూ మరింత బలోపేతం అవుతుందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక వారం రోజుల ముందు టిక్కెట్లు ప్రకటించి ఉంటే మరింత బాగుండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొందరినైనా మార్చి ఉంటే కేసీఆర్ కు కొంత అడ్వాంటేజీ ఉండేదని, కానీ అతి విశ్వాసంతో కేసీఆర్ సిట్టింగ్ లు అందరికీ టిక్కెట్లు ఇచ్చినందున గెలుపు సాధ్యం కాదని చంద్రబాబు చెప్పారు.

Similar News