కొనసాగుతున్న జేసీ ఆందోళన

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్నటి నుంచి ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయంలోనే వారు రాత్రంతా నిరసన తెలిపారు. సమీక్ష ఉందని చెప్పినా అధికారులు [more]

Update: 2021-08-03 04:13 GMT

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్నటి నుంచి ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయంలోనే వారు రాత్రంతా నిరసన తెలిపారు. సమీక్ష ఉందని చెప్పినా అధికారులు హాజరు కాకపోవడాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పు పడుతున్నారు. అధికారులు కావాలనే తాము నిర్వహించే సమీక్షకు హాజరు కాలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ సెలవుపై వెళ్లారని, ఉన్నతాధికారులు వచ్చేంత వరకూ తన నిరసన కొనసాగుతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News