ఇంతోటి దానికి ఎన్నికలు జరపడం ఎందుకో?

రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల పట్ల సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు చూస్తే ప్రజాస్వామ్యంపైనే నమ్మకం పోతుందన్నారు. ప్రజాస్వామ్యం [more]

Update: 2021-02-23 06:18 GMT

రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల పట్ల సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు చూస్తే ప్రజాస్వామ్యంపైనే నమ్మకం పోతుందన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందన్నారు. అభివృద్ధిని చూసి ఎవరూ ఓటేయరని ఈ ఎన్నికల ద్వారా స్పష్టమయిందని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పోలీసులే దగ్గరుండి పోలింగ్ అధికార పార్టీకి అనుకూలంగా మారుస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. ఇంతటిదానికి ఇక ఎన్నికలను ఎందుకు నిర్వహించడమని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News