బాబుకు జేసీ అదిరేటి సలహా

Update: 2018-05-29 08:44 GMT

చంద్రబాబుపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యంగ్యోక్తులు విసిరారు. అధికారులపై ఆధారపడటం సరికాదన్నారు. తాను ఎప్పుడు వెళ్లినా ఆర్డీవో దగ్గర నుంచి అందరూ అధికారులు సీఎం టెలికాన్ఫరెన్స్ లో ఉన్నారని చెబుతున్నారని, ఆ టెలికాన్ఫరెన్స్ లను ఆపాలని, అధికారులను పనిచేసుకోనివ్వాలని చంద్రబాబును మహానాడు వేదికగా కోరారు. కేవలం కలెక్టర్ల తో మాత్రమే చంద్రబాబు కాన్ఫరెన్స్ లు చేయాలని ఆయన కోరారు. సామాన్య వ్యక్తులెవ్వరూ తమ వద్దకు వచ్చి వాస్తవ విషయాలు చెప్పుకోలేరని, తాను క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించానని, మరోసారి చంద్రబాబు సీఎం కావాలన్నదే తన కోరికని జేసీ అన్నారు.

Similar News