మళ్లీ లైట్ తీసుకున్న జేసీ

Update: 2018-07-23 10:13 GMT

పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం తర్వాత రాజీనామా చేస్తానని చెప్పిన అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వెనక్కు తగ్గారు. సోమవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన అనంతరం జేసీ చల్లబడ్డారు. వాస్తవానికి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి కూడా హాజరుకానని జేసీ అలిగారు. అయితే, ముఖ్యమంత్రి ఫోన్ చేసి పార్లమెంట్ కి వెళ్లాలని కోరడంతో ఆయన అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యారు. ఆ సమయంలోనే అవిశ్వాసం తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే, సోమవారం ముఖ్యమంత్రి పిలుపుమేరకు అమరావతికి వెళ్లి సీఎంతో ఏకంతంగా భేటీ అయి చర్చించారు. అనంతరం మీడియాతో జేసీ మాట్లాడుతూ... తాను పార్లమెంట్ కు హాజరవుతానని ప్రకటించారు. అంతా సమసిపోయిందని, రాజీనామా చేయనని తేల్చారు. ప్రధానిగా మోదీ ఉన్నన్ని రోజులు విభజన హామీలు అమలు కావని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలు బాగా లేదని ఆయన పేర్కొన్నారు. అయితే, సీఎంతో ఏం మాట్లాడానో మాత్రం చెప్పనన్నారు.

Similar News