బ్రేకింగ్ : పోలీసుల అదుపులో జేసీ

అనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని వెంకటాపురంలో టీడీపీ నేత ఇంటి ఎదుట వైసీపీ కార్యకర్తలు గోడ నిర్మించారని తెలియడంతో మాజీ ఎంపీ జేసీ దివాకర్ [more]

Update: 2019-10-30 06:43 GMT

అనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని వెంకటాపురంలో టీడీపీ నేత ఇంటి ఎదుట వైసీపీ కార్యకర్తలు గోడ నిర్మించారని తెలియడంతో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. జేసీ దివాకర్ రెడ్డితో పాటు యామినీ బాల, బీటీ నాయుడులతో కలసి అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు అరగంట తర్వాత అందరినీ వారి ఇళ్లవద్దకు తరలించారు. తాము వాస్తవ పరిస్థితులను తెలుసుకుందామని వెళితే పోలీసులు అడ్డుకోవడమేంటని జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News