కేంద్రం జోక్యం చేసుకోదా?

రాజధాని అమరావతి అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశం కేంద్ర పరిధిలోనే ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విభజన [more]

Update: 2020-01-10 12:28 GMT

రాజధాని అమరావతి అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశం కేంద్ర పరిధిలోనే ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విభజన చట్టంలోనే రాజధాని కేంద్రం పరిధిలోనే ఉంటుందని స్పష్టంగా పేర్కొనిందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో అశాంతి నెలకొని ఉందన్న పవన్ కల్యాణ్, రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. కేంద్రం ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు ఈ విషయంపై తమ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News