వైసీపీ వర్సెస్ జనసేన

కాకినాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి ర్యాలీగా వెళుతున్న జనసేన కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెండు పక్షాల మధ్య [more]

Update: 2020-01-12 07:39 GMT

కాకినాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి ర్యాలీగా వెళుతున్న జనసేన కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెండు పక్షాల మధ్య రాళ్లదాడి జరిగింది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిన్న పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాకినాడ భానుగుడి సెంటర్ నుంచి ఎమ్మెల్యే ఇంటి వైపు జనసేన కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. అయితే వీరిని మధ్యలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు వర్గాలను పోలీసులు అదుపు చేయలేకపోయారు. కొందరికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News