జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన పవన్

త్వరలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పడబోతున్నాయని, ఇది మంచి నిర్ణయంని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన కాకినాడ పార్లమెంటరీ సమావేశంలో పవన్ కల్యాణ్ [more]

Update: 2019-07-30 14:23 GMT

త్వరలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పడబోతున్నాయని, ఇది మంచి నిర్ణయంని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన కాకినాడ పార్లమెంటరీ సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ త్వరలో ఏర్పడుతున్న జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్పారు. తాను అధికారం కోసం పాకులాడే వాడినయితే ఎప్పుడో కేంద్రమంత్రిని అయ్యేవాడినన్నారు. కానీ పదవుల కోసం తాను పార్టీ పెట్టలేదని, ప్రజలకోసమే పెట్టానని చెప్పారు. అసెంబ్లీలో హుందాతనం లోపించిందని పవన్ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు టీడీపీ , వైసీపీ పొత్తుల కోసం తనను సంప్రదించాయన్నారు పవన్ కల్యాణ‌్.

Tags:    

Similar News