జగన్ టెన్షన్ ను క్లియర్ చేస్తారా?

ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపైనే ఉత్కంఠ నెలకొంది. గత కొంతకాలంగా రాజధాని అమరావతిపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటనతో రాజధాని అమరావతిలో ఉంటుందా? [more]

Update: 2019-08-29 03:41 GMT

ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపైనే ఉత్కంఠ నెలకొంది. గత కొంతకాలంగా రాజధాని అమరావతిపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటనతో రాజధాని అమరావతిలో ఉంటుందా? లేదా? అన్న సందేహాలు తలెత్తాయి. అమెరికా నుంచి వచ్చిన వైఎస్ జగన్ దీనిపై ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీలు రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ మరికాసేపట్లో సీఆర్డీఏ సమీక్షను నిర్వహించనున్నారు. దీంతో జగన్ అమరావతిలపై కీలక నిర్ణయం వెలువరించే అవకాశముందని తెలుస్తోంది. జగన్ నిర్ణయం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సీఆర్డీఏ అధికారులతో జగన్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News