రాజధాని రైతులకు వరాలిచ్చినా…?

రాజధాని అమరావతిని వదిలించుకుని వెళ్లేందుకు జగన్ ప్రభుత్వం ఇష్టపడటం లేదు. అందుకే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలకంటే ఎక్కువగా జగన్ రాజధాని ప్రాంతవాసులకు ఇచ్చారు. గతంలో రైతులకు [more]

Update: 2020-01-20 08:25 GMT

రాజధాని అమరావతిని వదిలించుకుని వెళ్లేందుకు జగన్ ప్రభుత్వం ఇష్టపడటం లేదు. అందుకే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలకంటే ఎక్కువగా జగన్ రాజధాని ప్రాంతవాసులకు ఇచ్చారు. గతంలో రైతులకు కౌలు చెల్లింపు పదేళ్ల కాలం ఉంటే దానిని పదిహేనేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాజధాని గ్రామాల్లో భూమిలేని నిరుపేదలకు రూ.2500 లనుంచి ఐదువేలకు పెంచుతూ నిర్ణయం తీసుకన్నారు. అసైన్డ్ భూములున్న వారికి కూడా రిటర్న్ ప్లాట్లు ఇవ్వనున్నారు. గతంలో జరీబు భూమికి ఏడాదికి యాభైవేలు ఇస్తుంటే మరో ఐదు వేలు పెంచారు. మెట్ట భూమికి గతంలో ఏడాదికి 30 వేలు ఇస్తుంటే దానిని మరో మూడువేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే పరిపాలన రాజధానిని విశాఖకు తరలిస్తే రైతులకు ఇచ్చే ప్లాట్ల ధర ఎంత మేరకు పెరుగుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News