బ్రేకింగ్ : జగన్ కేసులో ఏపీ సర్కార్ కి షాక్

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలని కోరుతున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ కి చుక్కెదురైంది. ఈ కేసును ఎన్ఐఏ విచారించడం రాజ్యాంగ [more]

Update: 2019-01-21 06:57 GMT

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలని కోరుతున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ కి చుక్కెదురైంది. ఈ కేసును ఎన్ఐఏ విచారించడం రాజ్యాంగ విరుద్ధమని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటీషన్ పై ఇవాళ విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా ఎన్ఐఏ విచారణపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అయితే, ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణపై వివరాలు అందజేయాలని హైకోర్టు ఎన్ఐఏని ఆదేశించింది. దీంతో పాటు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ఈనెల 30వ తేదీ వరకు సమయం ఇచ్చింది. కేసును అదేరోజుకు వాయిదా వేసింది.

Tags:    

Similar News