బ్రేకింగ్ : జగన్ లండన్ పర్యటన రద్దు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు మూడు నెలల గడువు ఉన్నా ఇప్పుడే ఎన్నికల ఫీవర్ మొదలైంది. ప్రధాన పార్టీలు రెండూ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. [more]

Update: 2019-01-17 12:44 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు మూడు నెలల గడువు ఉన్నా ఇప్పుడే ఎన్నికల ఫీవర్ మొదలైంది. ప్రధాన పార్టీలు రెండూ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన దావోస్ పర్యటనను, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అభ్యర్థుల ఎంపికపై సమీక్షించేందుకు గానూ జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఆయన ఇవాళ సాయంత్రం లండన్ లో చదువుతున్న ఆయన కూతురు వద్దకు వెళ్లాల్సి ఉంది. అయితే, కీలకమైన సమయం కావడంతో జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు. ఇక, చంద్రబాబు కూడా దావోస్ పర్యటన రద్దు చేసుకుని తన స్థానంలో మంత్రి లోకేష్ ను పంపుతున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News