కేసును ఎన్ఐఏకి అప్పగించడం కూడా కుట్రే..!

జగన్ పై హత్యాయత్నం కేసును కేంద్రం ఎన్ఐఏకి అప్పగించడం కూడా బీజేపీ, జగన్ కి చేస్తున్న కుట్ర అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ అంశంపై [more]

Update: 2019-01-05 11:09 GMT

జగన్ పై హత్యాయత్నం కేసును కేంద్రం ఎన్ఐఏకి అప్పగించడం కూడా బీజేపీ, జగన్ కి చేస్తున్న కుట్ర అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ అంశంపై శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… కోడి కత్తి కేసు ఎన్ఐఏకి ఇవ్వాల్సినంత అవసరం కేంద్రానికి ఏముందని ప్రశ్నించారు. దీని వెనుక రాష్ట్రంపై కుట్ర ఉందని పేర్కొన్నారు. ఇక, ఇదే అంశంపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ… ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించడం అభ్యంతరకరమన్నారు. ఏపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నంలో భాగమే ఇదని పేర్కొన్నారు.

Tags:    

Similar News