న్యాయం అడిగిన ఇంటర్ విద్యార్థినిని ఈడ్చుకెళ్లిన పోలీసులు

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, తనకు రావాల్సినన్ని మార్కులు రాలేదని ఆవేదనతో ఇంటర్ బోర్డు వద్దకు వచ్చిన ఓ విద్యార్థిని పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. తాను [more]

Update: 2019-04-22 11:00 GMT

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, తనకు రావాల్సినన్ని మార్కులు రాలేదని ఆవేదనతో ఇంటర్ బోర్డు వద్దకు వచ్చిన ఓ విద్యార్థిని పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. తాను పరీక్ష బాగా రాశానని, అయినా మార్కులు వేయలేదని, తన పేపర్ చూపించాలని కోరుతూ అధికారులను కలవడానికి ఓ ఇంటర్ విద్యార్థిని ఇంటర్ బోర్డు వద్దకు వచ్చింది. అధికారులను కలవడానికి లోపలికి వెళ్లెందుకు ప్రయత్నించిన ఓ విద్యార్థిని పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఆమె బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారు. ఇంటర్ బోర్డు వద్ద ఆందళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రుల పట్ల పోలీసులు దుసురుగా వ్యవహరిస్తున్నారు.

Tags:    

Similar News