బ్రేకింగ్: ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బతీశాం

పుల్వామాలో సైనిక బలగాలపై దాడికి పాల్పడ్డ జైషే మహ్మద్ శిబిరాలపై వైమానిక దాడులు చేసి ప్రతీకారం తీర్చుకున్నట్లు భారతదేశ విదేశాంగ శాఖ కార్యదర్శి గోఖలే తెలిపారు. ఆయన [more]

Update: 2019-02-26 06:15 GMT

పుల్వామాలో సైనిక బలగాలపై దాడికి పాల్పడ్డ జైషే మహ్మద్ శిబిరాలపై వైమానిక దాడులు చేసి ప్రతీకారం తీర్చుకున్నట్లు భారతదేశ విదేశాంగ శాఖ కార్యదర్శి గోఖలే తెలిపారు. ఆయన ఢిల్లీలో దాడుల వివరాలను మీడియాకు వెల్లడించారు. పుల్వామా దాడి తర్వాత, అంతకుముందు కూడా ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్థాన్ కు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరిన్ని ఆత్మాహుతి దాడులు చేస్తారనే సమాచారం తమకు ఉన్నందున వాటిని నివారించేందుకు తాము ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి పెద్దసంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టామని తెలిపారు. భారత్ చేసిన వైమానిక దాడుల్లో ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. బాలాకోట్ లోని జైషే మహమ్మద్ అతిపెద్ద ఉగ్రవాద క్యాంపుని పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఆయన వివరించారు. పాకిస్థాన్ సహకారం లేనిదే ఉగ్రవాదులు దాడులు చేయలేరన్నారు. పీఓకేలో వందలాది ఉగ్రవాద క్యాంపులు ఉన్నాయని ఆయన తెలిపారు.

Tags:    

Similar News