బ్రేకింగ్ : విశాఖలో ఐటీ దాడులు షురూ.....!!!

Update: 2018-10-25 03:42 GMT

విశాఖపట్నంలో ఆదాయపు పన్ను శాఖ మెరుపు దాడులు ప్రారంభించారు. వివిధ పారిశ్రామిక సంస్థలపై ఈ దాడులు జరుపుతున్నారు. రెండు రాష్ట్రాల్లో వంద చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. విశాఖలోని దువ్వాడ ఎస్ఈజడ్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎంవీపీ సెక్టార్ 2లోని ఓ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బీచ్ శాండ్ ఎక్స్ పోర్ట్ కంపెనీపై కూడా దాడులు జరుగుతున్నాయి. ట్రాన్స్ వరల్డ్ కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఉదయం నాలుగున్నర గంటల నుంచే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఎగుమతులకు సంబంధించిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఎనిమిది మంది తో కూడిన అనేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. కొందరు ఛార్టెడ్ అకౌంటెంట్ల ఇళ్లల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. నిన్ననే విశాఖకు ఐటీ అధికారులు చేరుకున్నారని, దాడులు జరుగుతాయన్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఈరోజు ఉదయం నుంచే సోదాలు ప్రారంభం కావడం విశేషం.విశాఖతో పాటు విజయవాడ, గుంటూరు. నెల్లూరులో కూడా ఈ సోదాలు చేస్తున్నారు.

Similar News