చెప్పుతో కొట్టింది.. కారణమిదేనట

డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వని సంఘటన సంచలం రేగుతుంది. డబ్బుల కోసం నిలదీయడంతో ఫొటోలు, వీడియోలు వైరల్‌ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో [more]

Update: 2021-04-13 01:41 GMT

డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వని సంఘటన సంచలం రేగుతుంది. డబ్బుల కోసం నిలదీయడంతో ఫొటోలు, వీడియోలు వైరల్‌ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో కార్పొరేటర్‌ కార్యాలయంలోనే నిందితుడి చెంప చెప్పుతో చెళ్లుమనిపించింది. బాలానగర్‌ సీఐ ఎండీ వహీదుద్దీన్‌ తెలిపిన వివరాలు.. ఫతేనగర్‌ డివిజన్‌ గౌతమీనగర్‌లో ఉండే సయ్యద్‌ అహ్మద్‌ బాలానగర్‌ కార్పొరేటర్‌ వద్ద అసిస్టెంట్‌గా ఉంటున్నాడు. ఫిరోజ్‌గూడకు చెందిన ఓ వివాహితతో పరిచయం ఏర్పడి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని అహ్మద్‌ ఎమ్మెల్యే, కార్పొరేటర్లతో మాట్లాడి డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో ఆమె సుమారు రూ. 10 లక్షల వరకు ముట్టజెప్పింది.

కార్యాలయానికి వచ్చి….

డబ్బులు ఇవ్వకపోవడం, ఇంటి ఊసు ఎత్తకపోవడంతో ఆమె నిలదీసింది. బాలాగనర్‌ కార్పొరేటర్‌ ఆవుల రవీందర్‌ కార్యాలయానికి వచ్చి విషయం తేల్చమని అహ్మద్‌ను మరోసారి నిలదీసింది. ‘ఏం చేసుకుంటావో చేసుకో, నీ వీడియోలు, ఫొటోలు వైరల్‌ చేస్తా’నని బెదిరించాడు. దీంతో ఆమె చెప్పుతో కొట్టింది. విషయం తెలిసిన కార్పొరేటర్‌ వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అహ్మద్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో అతడిపై చీటింగ్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసారు. ఆమెపై కూడా 324 కేసును నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ విషయమై కార్పొరేటర్‌ ఆవుల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితమే విషయం తన దృష్టికి రాగా, హెచ్చరించినట్లు చెప్పారు.

Tags:    

Similar News