పరిపూర్ణానంద స్వామికి భారీ ఊరట

Update: 2018-08-14 06:14 GMT

నగర బహిష్కరణకు గురైన కాకినాడ శ్రీ పీఠాదిపతి పరిపూర్ణానంద స్వామికి హైకోర్టు ఊరట లభించింది. నెల రోజుల క్రితం శ్రీరాముడిపై కత్తి మహేష్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో, దీనికి నిరసనగా పరిపూర్ణానంద యాదాద్రికి పాదయాత్ర కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ యాత్రను అడ్డుకున్న పోలీసులు ఆయనను గృహనిర్భందం చేశారు. మొదట కత్తి మహేష్ ను, ఆ తర్వాత పరిపూర్ణానంద స్వామిని ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు బహిష్కరణను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News