గీతం కూల్చివేతలు ఆపండి.. హైకోర్టు ఆదేశం

గీతం యూనివర్సిటీ కూల్చివేతలపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఉదయం వరకూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. విశాఖలోని గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని [more]

Update: 2020-10-25 02:04 GMT

గీతం యూనివర్సిటీ కూల్చివేతలపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఉదయం వరకూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. విశాఖలోని గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని రెవెన్యూ అధికారులు నిర్మాణాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గీతం యూనివర్సిటీ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుడా కూల్చివేతలు చేపట్టారని కోరింది. శనివారం రాత్రి దీనిపై విచారించిన హైకోర్టు సోమవారం వరకూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని ఆదేశించింది.

Tags:    

Similar News