బిగ్ బ్రేకింగ్ : రేపు పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన మేరకు రేపు ఎన్నికలు జరిగేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. సింగిల్ బెంచ్ [more]

Update: 2021-04-07 09:42 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన మేరకు రేపు ఎన్నికలు జరిగేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. దీంతో యధాతధంగా రేపు ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. పరిషత్ ఎన్నికలను నిలుపుదల చేస్తూ ఈ నెల 6వ తేదీన సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఎస్ఈసీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. అయితే పదో తేదిన కౌంటింగ్ మాత్రం జరగదు. ఈ నెల 15వ తేదీ విచారణ తర్వాత కౌంటింగ్ ఎప్పుడనేది నిర్ణయించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News