ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. కరోనా కేసులు, ట్రీట్ మెంట్ పై వివరాలివ్వాలని హైకోర్టు ఆదేశించింది. చికిత్స విధానాన్ని కూడా తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. [more]

Update: 2021-04-23 00:46 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. కరోనా కేసులు, ట్రీట్ మెంట్ పై వివరాలివ్వాలని హైకోర్టు ఆదేశించింది. చికిత్స విధానాన్ని కూడా తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోజుకు ఎన్ని టెస్టులు చేస్తున్నారు? ఎంతమందికి చికిత్స అందిస్తున్నారన్న వివరాలను అఫడవిట్ ను దాఖలు చేయాలని కోరింది. సెకండ్ వేవ్ తీవ్రత దృష్ట్యా ఆసుపత్రుల్లో బెడ్స్ ఎన్ని అందుబాటులో ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించింది. ఆక్సిజన్, మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా? అని ప్రశ్నించింది. ఇప్పటి వరకూ ప్రభుత్వం దీనిపై అఫడవిట్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 27వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.

Tags:    

Similar News