హైకోర్టులో భావోద్వేగ వాతావరణం

ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియతో ఉద్విగ్న పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు కానుంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ [more]

Update: 2018-12-31 09:03 GMT

ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియతో ఉద్విగ్న పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు కానుంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టు ఉద్యోగులు బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. వీరికి తెలంగాణ హైకోర్టు ఉద్యోగులు వీడ్కోలు చెప్పారు. ఏపీ న్యాయవాదులకు తెలంగాణ న్యాయవాదులు వీడ్కోలు పలికారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు.

Tags:    

Similar News