హరికృష్ణకు ఫోన్ చేసిన వైఎస్...!

Update: 2018-08-30 12:02 GMT

రైతు సమస్యలపై నందమూరి హరికృష్ణకు పూర్తి అవగాహన ఉంది. ఆయన 2003లో రైతు సమస్యలను ప్రధానంగా చూపుతూ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ అనే సినిమాలో కూడా నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయం ఒక్కటి ఆ చిత్ర దర్శకుడు సముద్ర వెల్లడించారు. ఈ సినిమా కోసం రైతు సమస్యలపై తాను, పోసాని చాలా స్టడీ చేసి అన్ని సమస్యలను సినిమాలో చూపామన్నారు. ముఖ్యంగా హరికృష్ణ రైతుల సమస్యలపై ఆవేదన చెందేవారని గుర్తు చేసుకున్నారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నెపం కేంద్రంపై నెట్టేసి చేతులు దులుపుకుంటున్నాయని తరచూ అనే వారని సముద్ర తెలిపారు. సినిమా చేసిన తర్వాత అప్పటి ప్రతపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా హరికృష్ణకు ఫోన్ చేసినట్లు తెలిపారు. ‘‘సినిమా బాగా చేశావు హరి... ఈసారి మన ప్రభుత్వం వస్తుంది... మీ సినిమాలో చూపించిన రైతు సమస్యలను అన్నింటినీ పరిష్కరిద్దాం’’ అని హరికృష్ణకు మాట ఇచ్చినట్లు సముద్ర గుర్తుచేసుకున్నారు.

Similar News