బాబు తన పరువు తానే తీసుకున్నారు

Update: 2018-10-27 13:21 GMT

జాతీయ మీడియాతో చంద్రబాబు మాట్లాడటం చౌకబారుతనంగా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యులుజీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీలో ఐటీ దాడులు జరిగితే ఏదో విపత్తు జరిగినట్టు హడావిడిగా ఢిల్లీ వెళ్లారని అన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి తన పరువును తానే తీసుకున్నారన్నారు. పన్నులు ఎగ్గొట్టే వారిపై ఐటీ దాడులు జరిగితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. అవన్నీ చంద్రబాబు బినామీ ఆస్తులా? అనినిలదీశారు. చంద్రబాబు చెప్పేదొకటి,చేసొదకటిగా ఉందన్నారు. ఆంద్రప్రదేశ్ లో ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడిని పక్కదోవ పట్టించడానికే ఢిల్లీ వచ్చారన్నారు.

Similar News