జగన్ పైనా, మంత్రులపైనా కేసులు నమోదు చేయాలి

ముఖ్యమంత్రి జగన్ పై మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని హర్షకుమార్ [more]

Update: 2021-04-21 00:56 GMT

ముఖ్యమంత్రి జగన్ పై మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని హర్షకుమార్ ఆరోపించారు. రాజధాని అమరావతిలో దళితుల భూములు లాక్కున్నారని చంద్రబాబు, నారాయణలపై కేసు నమోదు చేసిన ప్రభుత్వం దళితుల భూములను ఇళ్ల పట్టాల పేరుతో అక్రమాలకు పాల్పడితే చర్యలకు తీసుకోరా? అని హర్షకుమార్ ప్రశ్నించారు. దళితుల భూములన లాక్కున్న జగన్, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్ లపై కూడా కేసు నమోదు చేయాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News