ఆజాద్ సెట్ చేస్తారా?

Update: 2018-09-19 02:39 GMT

కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న విభేదాలు, అనైక్యతను తొలగించేందుకు సీనియర్ నేత ఆజాద్ రంగంలోకి దిగుతున్నారు. ఈరోజు గులాంనబీ ఆజాద్ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఆయన ముఖ్యంగా సీనియర్ నేతలతో చర్చించడానికే వస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేతల మధ్య అనైక్యత లేకపోవడం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ప్రచార వ్యూహం లోపం కారణంగా గత ఎన్నికల్లో అధికారానికి రాలేకపోవడం వంటి విషయాలను ఆజాద్ చర్చించనున్నారు. సోనియా సభలను ఎక్కడెక్కడ నిర్వహించాలన్నదీ కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

పొత్తుల కారణంగా.....

తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొంత సందిగ్దంలో ఉన్నారు. ముఖ్యంగా సీనియర్ నేతలు పొత్తుల కారణంగా తమ అనుచరులకు టిక్కెట్లు దక్కవేమోనన్న ఆందోళనలో ఉన్నారు. పీసీసీని సంప్రదించినా వారు పెద్దగా స్పందించకపోవడంతో ఆజాద్ తోనే పొత్తుల విషయం, సీట్ల సర్దుబాటు వంటి విషయాలు చర్చించనున్నారు. పొత్తుల కారణంగా ఎవరైనా సీట్లు దక్కకుంటే వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామన్న భరోసా ఆజాద్ నేతలకు ఇవ్వనున్నారు. నిన్ననే రాహుల్ గాంధీ సీనియర్ నేతలకు దిశానిర్దేశం చేసి వెళ్లిన సంగతి తెలిసిందే.

Similar News