తిరుపతి ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించగలిగాం

తిరుపతి ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర బలగాలతో పాటు [more]

Update: 2021-04-18 01:23 GMT

తిరుపతి ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర బలగాలతో పాటు 69 ప్లటూన్ల కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాట్లను చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల వారు రాకుండా అడ్డుకున్నామని చెప్పారు. దాదాపు 250కి పైగా బస్సులను వెనక్కు తిప్పి పంపామని గౌతమ్ సవాంగ్ చెప్పారు. శాంతి భద్రతలకు భంగం కల్గిస్తారన్న అనుమానంతో 33,966 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 76 లక్షల నగదును, 94 వాహనాలను సీజ్ చేశామని గౌతమ్ సవాంగ్ తెలిపారు.

Tags:    

Similar News