గోదారిలో చిక్కుకున్నారు

Update: 2018-05-15 13:52 GMT

గోదావరి నదిలో సుడిగాలిలో లాంచి ప్రమాదం జరిగింది. సుమారు 40 మందితో వెళ్తున్న లాంచి నదిలో మునిగిపోయింది. దేవీపట్నం మండలం మంటూరు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ లాంచీలో ఓ పెళ్లీ బృందం కూడా ఉన్నట్లు తెలుస్తొంది. అప్పర్ గోదావరి ప్రాంతంలో నివసించే గిరిజనులు పోలవరంలో సంతకు వచ్చి వస్తువులు కొనుక్కుని వెళ్లేవారు ఈ బోటులో ఉన్నారు. బోటు మునుగుతుండగా కొందరు గిరిజనులు మాత్రం ఈత కొడుతూ ఒడ్డుకు చేరారు. ఇంకా పెద్దసంఖ్యలో గల్లంతయినట్లు తెలుస్తొంది. మునిగిన బోటు లక్షీ వెంకటేశ్వర బోట్ సర్వీస్ కు చెందింది. స్థానికులు, పోలీసులు నీట మునిగిన వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, కొన్ని నెలల క్రితమే విజయవాడ పవిత్ర సంగమం వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 16 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. రెండురోజుల క్రితం కూడా పాపికొండలు విహారయాత్రలో ఉన్న ఓ పడవలో అగ్నిప్రమాదం సంభవించింది.

Similar News