టీడీపీకి భారీ షాక్.. మరో ఎమ్మెల్యేకు గ్రీన్ సిగ్నల్ .. చేరిక ఎప్పుడంటే?

తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్ తగలనుంది. కీలక నేత గంటా శ్రీనవాసరావు టీడీపీని వీడనున్నారు. గంటా శ్రీనివాసరావు ఇప్పటికే వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని [more]

Update: 2020-07-24 02:32 GMT

తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్ తగలనుంది. కీలక నేత గంటా శ్రీనవాసరావు టీడీపీని వీడనున్నారు. గంటా శ్రీనివాసరావు ఇప్పటికే వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తుంది. ముఖ్యమంత్రి జగన్ సయితం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. గంటా రాకను విశాఖకు చెందదిన వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నా ఆయనను స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే నెల ఆగస్టు 15 వతేదీన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసే సందర్భంలో గంటా శ్రీనివాసరావు వైసీపీకి మద్దతుదారుగా నిలవనున్నారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం తరహాలోనే గంటా శ్రీనివాసరావు వైసీపీకి మద్దతు ఇవ్వనున్నారు. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని గంటా తన సన్నిహితులకు కూడా చెప్పేశారు.

Tags:    

Similar News