జగన్ కు గంటా సహకారం

జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యతిరేకిస్తుంటే అదే పార్టీకి చెందిన గంటా శ్రీనివాసరావు మాత్రం స్వాగతిస్తున్నారు. అసెంబ్లీలో జగన్ ప్రకటన తర్వాత [more]

Update: 2019-12-18 02:17 GMT

జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యతిరేకిస్తుంటే అదే పార్టీకి చెందిన గంటా శ్రీనివాసరావు మాత్రం స్వాగతిస్తున్నారు. అసెంబ్లీలో జగన్ ప్రకటన తర్వాత గంటా శ్రీనివాసరావు ట్విట్టర్లో స్పందించారు. రోడ్డు, రైలు, ఎయిర్, వాటర్ కనెక్టివి తో రాజధానిగా అందరి ఆకాంక్షలను నెరవేర్చే నగరంగా విశాఖపట్నం మారుతుందనడంలో సందేహం లేదన్నారు గంటా శ్రీనివాసరావు. కాస్మోపాలిటన్ నగరమైన విశాఖ పరిపాలనా కేంద్రంగా మారితే విశ్వనగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయమని, అందుకు విశాఖ ప్రజలు తమ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. గంటా వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశమయ్యాయి.

Tags:    

Similar News