గంటాకు బుజ్జగింపులు....!

Update: 2018-06-21 03:39 GMT

మరికాసేపట్లో విశాఖలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటిస్తుండటంతో మంత్రి గంటా శ్రీనివాసరావును బుజ్జగించే పనిలో పడ్డారు హోంమంత్రి చినరాజప్ప. అధిష్టానం వైఖరి, స్థానిక నేతలు తనను టార్గెట్ చేస్తున్నందుకు మనస్తాపం చెందిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మూడు రోజుల నుంచి అలకబూనిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరయిన గంటా మూడు రోజుల నుంచి ఇంటికే పరిమిత మయ్యారు. ఎటువంటి అధికార కార్యక్రమాలను పెట్టుకోలేదు.

ఫోన్ చేసిన చంద్రబాబు.....

అయితే ఈరోజు చంద్రబాబు పర్యటన విశాఖలో ఉండటం, అందునా గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలీ నియోజకవర్గంలో పర్యటిస్తుండటంతో గంటాను బుజ్జగించేందుకు హోంమంత్రి చినరాజప్ప ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు కూడా గంటాతో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. ఎవరి మాటలను పట్టించుకోవద్దని, మీ పని మీరు చేసుకువెళ్లాలని సూచించారు. అయితే చంద్రబాబు ఎదుట గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను ఫోన్లోనే గంటా వివరించినట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు పర్యటనలో గంటా పాల్గొంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Similar News