కేంద్రం నుంచి సహకారం లేదు

కరోనా వైరస్ రెండో దశ ప్రపంచాన్ని మొత్తం వణికిస్తుందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఎక్కువగా మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ [more]

Update: 2021-04-23 01:05 GMT

కరోనా వైరస్ రెండో దశ ప్రపంచాన్ని మొత్తం వణికిస్తుందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఎక్కువగా మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. కరోనా బాధితులంతా హైదరాబాద్ వస్తున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా రెండో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈటల రాజేందర్ మీడియాకు తెలిపారు. రెమిడెసివర్ ఇంజక్షన్లు హైదరాబాద్ లోనే తయారవుతున్నా తమకు కేంద్రం అందించడం లేదన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తామని చెప్పారు. నాలుగు లక్షల ఇంజక్షన్లు ఆర్ఢర్ ఇస్తే 21 వేలు పంపారంటూ ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags:    

Similar News