ఈటలకు మరో షాక్

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాని మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మాత్రం షాక్ లు మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా [more]

Update: 2021-08-22 07:05 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాని మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మాత్రం షాక్ లు మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా ఈటల రాజేందర్ ప్రధాన అనుచరులు ఇద్దరు ఆయనకు గుడ్ బై చెప్పేశారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ప్రధాన అనుచరులైన పింగిలి రమేష్, చుక్కా రంజిత్ లు పార్టీ నుంచి వెళ్లిపోయారు. వారిద్దరూ టీఆర్ఎస్ లో చేరారు. ఈటల రాజేందర్ ను మానసికంగా దెబ్బతీసి, ఒంటరి చేసే ప్రయత్నంలో భాగంగా వారిద్దరినీ గులాబీ పార్టీ తన చెంతకు రప్పించుకుంది.

Tags:    

Similar News