మళ్లీ ప్రారంభిస్తా…. తాత్కాలిక విరామమే

హుజూరాబాద్ లో తన పాదయాత్ర తిరిగి కొనసాగుతుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అస్వస్థతకు లోనయినందున తాత్కాలికంగా విరమాన్ని ప్రకటించామని చెప్పారు. వేయాల్సిన అడుగులు, చేరాల్సిన [more]

Update: 2021-08-01 02:47 GMT

హుజూరాబాద్ లో తన పాదయాత్ర తిరిగి కొనసాగుతుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అస్వస్థతకు లోనయినందున తాత్కాలికంగా విరమాన్ని ప్రకటించామని చెప్పారు. వేయాల్సిన అడుగులు, చేరాల్సిన ఊళ్లు చాలా ఉన్నాయని ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజాదీవెన యాత్ర తాత్కాలికంగా వాయిదా పడినందుకు బాధపడుతున్నానన్నారు. తన ఆరోగ్యం సహకరించగానే తిరిగి ప్రజా దీవెన యాత్రను ప్రారంభిస్తానని ఈటల రాజేందర్ తెలిపారు.

Tags:    

Similar News