ఎవరికి ఆత్మగౌరవం ఉందో అందరికీ తెలుసు

20 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్నానని, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నానని ఈటల రాజేందర్ తెలిపారు. తన రాజీనామా తర్వాత అయినా అందరికీ పింఛన్లు వస్తాయని భావిస్తున్నానన్నారు. [more]

Update: 2021-06-09 12:45 GMT

20 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్నానని, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నానని ఈటల రాజేందర్ తెలిపారు. తన రాజీనామా తర్వాత అయినా అందరికీ పింఛన్లు వస్తాయని భావిస్తున్నానన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో అందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు అందజేయాలని ఈటల రాజేందర్ కోరారు. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పటివరకూ సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని ఆయన ఆవేదన చెందారు. ఏ ఎన్నిక వచ్చినా కేసీఆర్ వరాల జల్లును ప్రకటిస్తారని ఈటల తెలిపారు. తమ నియోజకవర్గంలో నేతలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మిడతల దండు దాడి చేస్తున్నట్లు టీఆర్ఎస్ వాళ్లు తన సానుభూతిపరులపై దాడులు చేస్తున్నారని ఈటల రాజేందర్ మండి పడ్డారు. హరీశ్ రావుకు ఆత్మగౌరవం ఉందో, తనకు ఉందో ప్రజలకు తెలుసునని ఈటల రాజేందర్ అన్నారు.

Tags:    

Similar News