స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ తప్పదు

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించక తప్పదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాధానం చెప్పింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ [more]

Update: 2021-03-09 00:37 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించక తప్పదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాధానం చెప్పింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో జవాబు చెప్పారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో రాష్ట్రానికి ఎలాంటి వాటాలు లేవన్నారు. స్టీల్ ప్లాంట్ లో వంద శాతం పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. కార్మికుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా పర్ఛేజ్ అగ్రిమెంట్ ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

Tags:    

Similar News