బీహార్ లో తొలిదశ పోలింగ్ ప్రారంభం

బీహార్ లో తొలిదశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 71 అసెంబ్లీ స్థానాలకు నేడు తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,066 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. రెండు [more]

Update: 2020-10-28 02:45 GMT

బీహార్ లో తొలిదశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 71 అసెంబ్లీ స్థానాలకు నేడు తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,066 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. రెండు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కరోనా సందర్భంగా ఎన్నికల కమిషన్ పోలింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒక్కొక్క పోలింగ్ కేంద్రం వద్ద వెయ్యి మందికి మాత్రమే అనుమతి ఇస్తుంది. ఈవీఎంలను ఈ పోలింగ్ కు వినియోగిస్తున్నారు. ఈవీఎంలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. కరోనా పాజిటివ్ ఉన్న వారు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

Tags:    

Similar News