హైదరాబాద్ లో కొత్త రకం డ్రగ్స్

Update: 2018-08-18 09:58 GMT

నిషేధిత టాబ్లెట్లను విక్రయిస్తున్న రాజేశ్ అనే వ్యక్తిని ఎక్సైజ్ అండ్ ఇన్ఫోర్స్ మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపేటకు చెందిన రాజేష్ నుంచి ఎనిమిది వేల రెండు వందల మత్తు మందు టాబ్లెట్లను స్వాదీనం చేసుకుని సీజ్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ నుంచి ఈ ఆల్ఫ్రాజోలమ్ టాబ్లెట్స్ తెచ్చి అమ్ముతున్నాడు. ఎక్కువగా కార్మికులకు, ఆటో డ్రైవర్లు, కొంత మంది వ్యాపారులకు ఈ టాబ్లెట్స్ ను సరఫరా చేస్తున్నాడు. కేవలం తెలిసిన కస్టమర్లకే విక్రయిస్తాడు. ఒక్కో టాబ్లెట్ ను యాభై నుంచి వంద రూపాయలు అమ్ముతున్నాడు. ఈ టాబ్లెట్లు ఎక్కువ వాడితే ఒక్కొక్కసారి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ఈ డ్రగ్ కి అలవాటు పడితే, ఆ మత్తు మందు లేకపోతే ఉండలేని పరిస్థితికి వెళ్లిపోతారు.

Similar News