బ్రేకింగ్: దినకరన్ కు దిమ్మ తిరిగే షాక్

Update: 2018-06-14 08:32 GMT

దినకరన్ వర్గానికి హైకోర్టులో షాక్ తగిలింది. మద్రాస్ హైకోర్టులో దినకరన్ వర్గానికి షాక్ తగిలింది. అన్నాడీఎంకేను వ్యతిరేకిస్తూ 18 మంది ఎమ్మెల్యేలు దినకరన్ గూటికి చేరారు. ఈ 18 మందిపై స్పీకర్ ధన్ పాల్ అనర్హత వేటు వేశారు. దీనిపై దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే మద్రాస్ హైకోర్టులో ఈ కేసును స్వీకరించిన ఇద్దరు జడ్జిల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్పీకర్ నిర్ణయాన్ని ఒక న్యాయమూర్తి సమర్థించగా, మరొకరు వ్యతిరేకించారు. దీంతో ఈకేసును ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి పంపాలని నిర్ణయించారు. దీంతో పళనిస్వామి, పన్నీర్ సెల్వానికి తాత్కాలిక ఊరట లభించినట్లయింది.

Similar News