Tdp : మరో కేసులో ధూళిపాళ్ల నరేంద్ర

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ రవాణా గురించి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసినందుకు ఆయనపై పోలీసులు [more]

Update: 2021-10-08 03:24 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ రవాణా గురించి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిరాధార ఆరోపణలు చేశారని, దీనికి సంబంధించిన ఆధారాలను విచారణకు వచ్చి సమర్పించాలని ధూళిపాళ్ల నరేంద్రకు ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. పొన్నూరు మండలంలోని చింతలపూడిలోని ఆయన స్వగృహంలో కాకినాడ పోలీసులు నోటీసులు ఇచ్చి వెళ్లారు.

Tags:    

Similar News